1

Breaking News



అమ్మ తోడు… 15 కోట్లు ఇచ్చినా చెయ్యను…వి వి వినాయక్




డైరెక్టర్ వి వి వినాయక్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముందుగానే ఓ అంచనాలకి వచ్చేస్తారు. కొత్త హీరోలను వెండి తెరకు పరిచయం చెయ్యాలంటే అది వినాయక్ తర్వాతే ఎవరైనా అనే ముద్ర వేసుకున్నాడు . మాస్ సినిమా డైరెక్టర్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వినాయక్. అల్లుడు శ్రీను తో బెల్లంకొండ శ్రీనివాస్ ను మాస్ హీరోగా పరిచయం చేసాడు వినాయక్. ఆ తర్వాత అఖిల్ కోసం నాగార్జున వినాయక్ ని సంప్రదించాడు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. రోగ్ సినిమా హీరో ఇషాన్ పరిచయం చేసే ఆఫర్ కూడా ముందుగా వినాయక్ కే వచ్చిందట. వినాయక్ కాదనడం తో ఇషాన్ తండ్రి భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడు. కానీ వినాయక్ ముందుకు రాలేదు. దాదాపు 15 కోట్లు రెమ్యూనరేషన్ వదులుకున్నాడు. ఆ తర్వాత ఆ అవకాశం పూరికి వచ్చింది. కొత్త హీరోని పరిచయం చేస్తున్నప్పుడు తెసుకోవాల్సిన జాగ్రతలేవీ పూరి తీసుకోలేదు. ఫలితంగా సినిమా అంతంత మాత్రంగా మిగిలిపోయింది. కొద్దోగొప్పో ఇషాన్ మాత్రం ఆకట్టుకున్నడనే చెప్పాలి. వినాయక్ తో కలిసి చేసుంటే మంచి విజయనే అందుకునేవాడని ఫిలింనగర్ టాక్.

No comments