1

Breaking News

సీఎం.. సమైక్యనాటకం అదుర్స్:అంబటి

సీఎం.. సమైక్యనాటకం అదుర్స్:అంబటి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గేమ్‌ప్లాన్‌లో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యనాటకం ఆడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల

ప్రకారమే స్పీకర్ మనోహర్ శాసనసభను నడిపిస్తున్నారని ఆయన అన్నారు. స్పీకర్ వ్యవస్థను పూర్తిగా మలినం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కించుకుందన్నారు. తెలుగువారి

ఆంధ్రప్రదేశ్‌ను రెండుముక్కలు చేయడానికి సోనియా కంకణం కట్టుకున్నారని.. వాళ్లకి బుద్ధి, జ్ఞానం లేదని అంబటి మండిపడ్డారు. సమైక్య శంఖారావం పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

చేపడుతున్నారని.. విభజనను వైసీపీ సర్వశక్తులు అడ్డుకోవాలని ధృడనిశ్చయంతో ఉందని.. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి తమ అధినేత కోరినట్లు తెలిపారు. అవసరమైతే సుప్రీం

కోర్టుకు కూడా అఫిడవిట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్, టీడీపీలోని సమైక్యవాదులంతా బయటకు వచ్చి ముక్తిపొందాలన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేసీఆర్ చెప్పిందే

చంద్రబాబు చెప్పారని.. అందుకే ఒక్కరే వెళ్లారని ఆయన సెలవిచ్చారు.

No comments