1

Breaking News

పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలు

పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలు ఆరంభం
 కడపలో ప్రఖ్యాతిగాంచిన పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలు ఆరంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ తెల్లవారు జామునుంచే ప్రారంభమయ్యాయి. గతంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ముస్లిం మతపెద్దలు, ప్రత్యేకంగా అలంకరించిన ఛాదర్‌ను మోసుకొచ్చి సమాధిపై కప్పారు. ముస్లింలు ఊరేగింపుగా కవ్వాలీ పాడుతూ గంధం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు నటుడు రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య హాజరయ్యారు. దర్గాను దర్శించుకున్న ఆమెకు మతపెద్దలు దర్గా విశిష్టతను వివరించారు. సాయంత్రం సంగీత కచేరీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ హాజరుకానున్నారు.

No comments